నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:25

కేంద్రమంత్రి నివాసంలో మృతదేహం కలకలం.. తనయుడిపైనే అనుమానం

లఖ్‌నవూ: కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్(Union Minister Kaushal Kishore) నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కేంద్రమంత్రి తనయుడే ఆ యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవ అని పోలీసులు వెల్లడించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని ఆ కథనాలు పేర్కొన్నాయి..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:18

Adilabad: అనుమానంతో భార్యను చంపి.. లొంగిపోయేందుకు వెళ్తూ..

ఆదిలాబాద్‌ : భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. అక్కడికి కొద్దిసేపటిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణానికి సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.

అనుమానంతో శుక్రవారం వేకువజామున దీపను అరుణ్‌ హత్య చేశాడు. అనంతరం లొంగిపోతానంటూ ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఖుర్షిద్‌నగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని అరుణ్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 11:16

డీజీపీ ఆఫీస్‌ ముట్టడి యత్నం.. తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా..

పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

జీవో నెంబర్‌ 46 నుంచి టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్‌ 46తో హైదరాబాద్‌కు 53 శాతం రిజర్వేషన్‌.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 10:52

''వన్ నేషన్ - వన్ ఎలక్షన్ '' దిశగా కేంద్రం..

•త్వరలోనే బిల్లు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అందుకేనా..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే ముగియగా.. మరోసారి ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ప్రకటన విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

అయితే ఉన్నపళంగా ఈ సమావేశాలు దేనికంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే '' వన్ నేషన్ , వన్ ఎలక్షన్'' బిల్లును ప్రవేశపెట్టేందుకే కేంద్రం ఈ సమావేశాలు నిర్వహిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. దీనిపై ఇప్పటికే పలుమార్లు మేధావులు సూచనలు చేయగా.. లా కమీషన్ ఆఫ్ ఇండియాచే అధ్యయనం చేయబడింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వాటి గడువు ముగిసిన తర్వాత జరుగుతాయి. ఇది సాధారణంగా ప్రతి ఏడాది రెండు ఎలక్షన్ సైకిల్స్‌గా చెబుతారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదన కింద.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సైకిల్‌లో ఎన్నికలు జరుగుతాయి. బహుశా ఒకే రోజు ఓటింగ్ జరుగుతుంది.

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:43

Aditya L1 Mission: ఆపరేషన్‌ ఆదిత్య- ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధం

Aditya L1 Mission: సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది..

తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతోంది. మరో 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనున్నది.

రేపు ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆదిత్య - ఎల్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి -సి 57 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్ళబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. రాకెట్ ప్రయోగానికి మిషన్ సన్నద్దతా సమావేశం పచ్చ జెండా ఊపింది..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:35

అక్కకు 95, తమ్ముడికి 85

సుభాష్‌నగర్‌: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది..

గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు.

సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:19

గురువులకు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.

టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ రేపటిలోగా షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ బదిలీ ప్రక్రియలో భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:18

భారత డైనమిక్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పీవీ రాజారామ్‌

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ బీడీఎల్‌ డైరెక్టర్‌ ప్రొడక్షన్‌ గా పీవీ రాజారామ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన.. పృథ్వీ, ఆకాష్‌ తదితర క్షిపణుల తయారీలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ రంగంలో రాజారామ్‌కు 34 ఏండ్ల అనుభవం ఉన్నది. గతంలో బీడీఎల్‌ హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ యూనిట్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, యూనిట్‌ హెడ్‌గా కూడా విధులు నిర్వహించారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:17

శ్రావణ శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బీభత్సంగా పెరిగింది. నేడు శుక్రవారం అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు.

నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న గురువారం తిరుమల శ్రీవారిని 59,808 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.6 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,618 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 09:16

తెలంగాణలో మరోసారి అమిత్ షా" పర్యటన

మరోసారి తెలంగాణ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు.ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది...